నంద్యాల ఎంపీ శబరి జగన్నాథగట్టుపై కబ్జా చేశానని ఆరోపించడం అబద్ధమని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. గురువారం కల్లూరులో ఆయన మాట్లాడుతూ రేషన్ బియ్యం ఏవిధంగా పట్టుకున్నారో, అదేవిధంగా వైన్ షాపులను బార్ షాపులాగా మార్చుకొని అమ్ముకుంటూ గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుకుంటుంటే కనిపించడంలేదా అని ప్రశ్నించారు. చేతనైతే ఎక్సైజ్ అధికారులను తీసుకొనిపోయి దాడులు చేయాలన్నారు.