పోలీసులు దిగజారుడు ఉద్యోగాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. గురువారం కల్లూరులోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టిడిపి నాయకులకు ఒక న్యాయం వైసీపీకి ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. 4వ పట్టణ సిఐ టీడీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నాడని మండిపడ్డారు. సీఐ పోలీసు డ్రెస్ తీసివేసి పచ్చ బట్టలు వేసుకొని డ్యూటీ చేస్తే బాగుంటుందని విమర్శించారు.