ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి జోషి కు నంద్యాల, కర్నూలు ఎంపీలు నాగరాజు, శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీజీ వెంకటేష్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘన స్వాగతం పలికారు. పిన్నాపురం లోని గ్రీన్ కో ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు.