గోకులాలతో క్షీర విప్లవం రావాలని, గోకులాలను సద్వినియోగం చేసుకోవాలని డ్వామా పీడీ పి. వెంకట రమణయ్య అన్నారు. శనివారం ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో గోకులం షెడ్లను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో రైతులు గోకులాలను నిర్మించుకుంటున్నారని తెలిపారు. 90 శాతం సబ్సిడీతో గోకులాలు నిర్మించేందుకు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. జేడీ శ్రీనివాస్, సర్పంచ్ గోవర్ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.