పాణ్యం మండలం చెరువు కట్టపై ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం భారీ బోర్డులు అనుమతి లేకుండా ఏర్పాటు చేసింది. ఇది చెరువు నీటికి ముప్పుగా మారుతుందని శుక్రవారం ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి బత్తిని ప్రతాప్ ఒక ప్రకటనలో ఆరోపించారు. అనుమతి లేకుండా ఉన్న చర్యలు లేకపోవడం దారుణమని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ స్కూల్ బోర్డులు చెరువుకి ముప్పుగా మారినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.