పాణ్యం పరిధిలోని ఆర్ జీయం శాంతిరాం ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా రెండు కిలోమీటర్ల మేర రెడ్ జోన్ ప్రకటించినట్లు శుక్రవారం నాడు నంద్యాల జిల్లా ఎస్పీ కే. రఘువీరారెడ్డి పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూముల చుట్టూ ఆకాశంలో సైతం అనధికార డ్రోన్ల కార్యకలాపాలపై నిషేధం విధించినట్లు తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా రాజకీయ పార్టీలు నిబంధనలు పాటించాలని ఎస్పీ హెచ్చరించారు.