పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను సోమవారం పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి అరెస్టు చేశారు. వీరిద్దరిపై కలిపి 60 దొంగతన కేసులు ఉన్నాయి. పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద పట్టుబడిన వారి నుంచి పావుకిలో బంగారు, కిలో వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై 20 కేసులు, మరోకరిపై 40 దొంగతనం కేసులు నమోదయ్యాయి. పోలీసులను ఏఎస్పీ జావళి ఆల్ఫోన్స్ అభినందించారు.