కొసనపల్లెలో కిషోరి వికాస బాలికలకు అవగాహన శిబిరం

69చూసినవారు
కొసనపల్లెలో కిషోరి వికాస బాలికలకు అవగాహన శిబిరం
వెల్దుర్తి మండలం చెరకలపాడు సచివాలయం పరిధిలోని కొసనపల్లెలో శుక్రవారం కిషోరి వికాస బాలికల కోసం వేసవి శిబిరం నిర్వహించారు. సీడీపీవో లుక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు రక్తహీనత, పరిశుభ్రత, బాల్యవివాహాల దుష్పరిణామాలపై బాలికలకు అవగాహన కల్పించారు. డా. మల్లికార్జున యుక్తవయసు మార్పులపై, డా. సుధాకర్ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలపై సూపర్వైజర్ సరస్వతి సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్