వెల్దుర్తి సచివాలయం 3 పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో పునరుత్పత్తి ఆరోగ్యం, బాలవివాహాల నష్టాలపై శుక్రవారం సిడిపివో లుక్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. 15-18 ఏళ్లలో వివాహం వల్ల తల్లి, శిశువుకు నష్టాలు ఉంటాయని, బాల్యవివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బాల్య వివాహాలు అరికట్టడంలో ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.