కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షల్లో శుక్రవారం ఆరుగురు విద్యార్థులు చూచిరాతకు పాల్పడగా అధికారులు డిబార్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 55 కేంద్రాల్లో 8,188 మందికి పరీక్షలుండగా 7 404 మంది హాజరయ్యారు. కర్నూలు, పత్తికొండ, నంద్యాల, డోన్ కేంద్రాల్లో విద్యార్థులు పట్టుబడ్డారని వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా. వెంకటేశ్వర్లు తెలిపారు.