పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండల సర్వసభ్య సమావేశం బుధవారం కూడా కోరం లేక వాయిదా పడింది. మంగళవారం మొదటి రోజు వాయిదా తర్వాత, రెండో రోజు కుడా ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఇతర అధికారులు గైర్హాజరయ్యారు. ఎంపీడీవో విశ్వమోహన్, ఈవో శ్రీహరి, నలుగురు అధికారులు మాత్రమే పాల్గొన్నారు. సమావేశం రద్దయ్యిన అనంతరం 15 రోజులకు వాయిదా వేయాలని ఎంపీడీవో నిర్ణయించారు.