పత్తికొండలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ లైనింగ్ ఒక్కరోజులో కూలిపోవడంపై జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన స్థాయి సంఘ సమావేశంలో ఆయన అధికారులను ప్రశ్నించారు. పనులు నాణ్యతతో చేయాలని, లైనింగ్ పనులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. 75 చెరువులకు తక్షణమే నీరు నింపాలన్నారు. రహదారి నిర్మాణంలో ప్రజల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు.