పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం ముగ్గురు సారా విక్రేతలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ విశ్వేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం. రాంపల్లి (తుగ్గలి మండల) గ్రామానికి చెందిన రంగమ్మ, మరెళ్ల గ్రామానికి చెందిన సోమశేఖర్, గోవిందు సారా విక్రయిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నాటుసారా తయారీదారులపై నిఘా ఉంటుందని సీఐ హెచ్చరించారు.