రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాలకు సమానత్వం కల్పించినట్టు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ అన్నారు. గురువారం ఆయన పత్తికొండలో టీడీపీ నాయకులతో కలిసి మాట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం, ఎస్సీ వర్గీకరణ, రహదారుల మరమ్మతు, పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినట్లు ఎమ్మెల్యే శ్యాంకుమార్ తెలిపారు.