తుగ్గలి మండలంలోని రాంపల్లిలో బుధవారం జరిగిన ఏకాశి సరోజ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త ఏకాశి రామానాయుడుపై కేసు నమోదు చేశామన్నారు. హత్యకు మరి కొందరు ప్రేరేపించారనే కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా విచారణ చేస్తామని చెప్పారు.