ఆపరేషన్ సిందూర్లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీకి చెందిన మురళి నాయక్ వీరమరణంపై శుక్రవారం పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు స్పందించారు. దేశ రక్షణలో మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్కు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు అని పేర్కొన్నారు.