రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో కర్నూలు జిల్లా ఇన్చార్జి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, లాడ్జీలు, బస్టాండ్లు, చెక్పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు జరిపారు. లాడ్జీల్లో కొత్త వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.