వెల్దుర్తి: రైల్వే పట్టాలపై వ్యక్తి ఆత్మహత్య

62చూసినవారు
వెల్దుర్తి: రైల్వే పట్టాలపై వ్యక్తి ఆత్మహత్య
అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నబాబు (42) అనే వ్యక్తి, తన కుమార్తె, అల్లుడికి భారమవ్వకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం బనగానపల్లె మండలానికి చెందిన చిన్నబాబు, ఇటీవల పక్షవాతంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కుమార్తె ఉన్న ఆయన బుధవారం రాత్రి బయటకు వెళ్లి గురువారం వెల్దుర్తి గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. ప్రాథమిక విచారణలో గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.

సంబంధిత పోస్ట్