రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విజన్-2047 యాక్షన్ ప్లాన్ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించారు. సోమవారం పత్తికొండలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రారంభించారు. అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, సహజ వనరులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. రెవెన్యూ అధికారి డా. భరత్ నాయక్, ఐదు మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు కార్యక్రమంలో పాల్గొన్నారు.