పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, అధైర్య పడొద్దని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. బుధవారం ఆయన తుగ్గలిలో మాట్లాడారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించి నివేదికలు పంపాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. పగిడిరాయి సమీపంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పంటలను పరిశీలించిన ఆయన రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.