మహానంది క్షేత్రంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. మహానందిలో సుమారు 20 పైగా వివాహాలు జరగడంతో ఆలయ ప్రాంగణం వధూవరుల బంధుమిత్రులు, భక్తులతో కళకళలాడింది. అధిక సంఖ్యలో భక్తులు
తెల్లవారుజాము నుంచే శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివారి దర్శనానికి బారులు తీరారు. భక్తులు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు.