సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేయుండడంతో మందుబాబులు ఆదివారం నుంచే మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గురువారం ఉదయం 11 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేనున్నాయి. ఈ నేపథ్యంలో మందుబాబులు ముందుగానే మద్యం దుకాణాల వద్ద బారులు తీరి మద్యం నిలువలను చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.