నిత్యాన్నదాన పథకానికి రూ. 1, 11, 111 విరాళం

65చూసినవారు
నిత్యాన్నదాన పథకానికి రూ. 1, 11, 111 విరాళం
శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి కర్ణాటక రాష్ట్రంలోని సింధునూరుకు చెందిన శర్వారి దేవీ రెడ్డి అనే భక్తుడు రూ. 1, 11, 111 విరాళం అందజేశారు. ఈ మేరకు సంబంధిత విరాళ సొమ్మును ఆదివారం దేవస్థానం డొనేషన్ కౌంటర్ నందు ఆలయ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు దాతలకు ఆలయ మర్యాదలతో స్వామి అమ్మవార్ల దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్