రేపు రెండవ శనివారం కారణంగా నంద్యాలలోని 220kv కేంద్రంలో నిర్వహించే పనుల కారణంగా మహానంది మండలంలోని తిమ్మాపురం, బుక్కాపురం, గాజులపల్లి సబ్స్టేషన్ పరిధిలో త్రీఫేస్ కరెంట్ రాత్రి 12 గంటల తర్వాత మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈర్నపాడు సబ్స్టేషన్ నుంచి గృహ వినియోగదారులకు కరెంట్ సప్లై చేసే అవకాశం ఉన్నా, ఎమర్జెన్సీ ఎల్సీ తీసుకుంటే ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు కరెంట్ ఉండదు. వినియోగదారులు సహకరించాలని ఏఈ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.