బండి ఆత్మకూరు మండలం వెంగళరెడ్డిపేటలో శుక్రవారం ఎస్సై జగన్మోహన్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాల నివారణ, టోల్ ఫ్రీ నంబర్లు 1830, 112, 100 ఉపయోగాల గురించి ప్రజలకు వివరించారు. సైబర్ నేరాలకు ప్రజలు బలవుతున్నారని, మోసపోతే వెంటనే 1930కి సమాచారం అందించాలని కోరారు.