మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన రైతులు ఈశ్వరయ్య, సూరి, రవి, ప్రసాద్లు అల్లినగరం గ్రామ సమీపంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట విత్తన పసుపును భద్రపరిచారు. అయితే శనివారం అది ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమైంది. గ్రామస్థులు వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో రైతులకు రూ.2.5 లక్షల వరకు నష్టం వాటిల్లింది.