శ్రీశైలం దేవస్థానంలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులను రాయలసీమ జోన్లోని ఇతర ఆలయాలకు బదిలీ చేశారు. కమిషనర్ రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు, వి. మోహన్, ఏడుకొండలు శ్రీకాళహస్తికి, శివారెడ్డి, గిరిజామణి తదితరులు మహానందికి, పోలేశ్వరరావు మద్దిలేటికి, మంజునాథ్ కాణిపాకానికి బదిలీ అయ్యారు.