ప్రభుత్వ పక్కా గృహాలు మంజూరైన లబ్ధిదారులు గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని నంద్యాల డిఎఫ్ఓ, మండల ప్రత్యేక అధికారిని నాగ మునీశ్వరి శుక్రవారం సూచించారు. వెలుగోడు మండల పరిషత్తు కార్యాలయంలో ఆమె గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఇంజనీరింగ్ సహాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పక్కా గృహాల కాలనీలో నిర్మాణాలను ఆమె పరిశీలించారు. జూన్ 10వ తేదీలోగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.