ఎమ్మిగనూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 15 అర్జీలను వచ్చాయి. శుక్రవారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వచ్చిన అర్జీలను పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. ప్రధానంగా భూ వివాదాలు, నర్సింగ్ సిబ్బంది నియామక సమస్యలు, వాల్మీకి మహర్షి విగ్రహ స్థాపన వంటి సమస్యలపై 15 అర్జీలు అందాయని తెలిపారు.