ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. నాగలదిన్నె వద్ద తుంగభద్ర నదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను ఎస్సై కేశవ నేతృత్వంలో స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్లను స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై కేశవ్ తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.