జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కాల్పుల్లో శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందారని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జవాను మృతి విషాదకరమని, దేశ రక్షణలో ఆయన త్యాగం అమూల్యమని కొనియాడుతూ, మురళీ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.