గోనెగండ్ల మండలంలోని గంజహళ్లి గ్రామంలో జరిగిన కడివెల్ల నబి ఉరుసు వేడుకల్లో శుక్రవారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కులమతాలకు అతీతంగా భక్తులచే పూజలు అందుకుంటున్న శ్రీసద్గురు మహాత్మా బడే సాహెబ్ తాత స్వాముల వారి దర్గాను దర్శించి ఆశీస్సులు పొందారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.