డివైఎఫ్ఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 14న సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మిగనూరు పట్టణంలో శివన్న నగర్ సచివాలయం వద్ద ఈ నెల 14న ముగ్గుల పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.