నందవరం మండలంలోని కనకవీడు గ్రామంలో రైతు నాగేంద్రప్పకు చెందిన రెండు గడ్డివాములు శుక్రవారం అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామంలోని ట్రాన్స్ ఫార్మర్ నుంచి వచ్చిన నిప్పులు గడ్డి వాములకు వ్యాపించడంతో మంటలు చెలరేగాయి. గ్రామస్తులు అదుపు చేయేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు. ఫైర్ ఆఫీసర్ రామాంజనేయులు సిబ్బందితో చేరుకొని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.1.90 లక్షల నష్టం జరిగిందని రైతు తెలిపాడు.