ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం టీడీపీ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు స్థాయిలో సంస్థాగత కమిటీ ఎన్నికల ప్రాధాన్యతను పరిశీలిస్తూ, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలనీ, పార్టీని బలోపేతం చేయాలనీ ఎమ్మెల్యే బీవీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీపై కూడా చర్చించారు.