ఎమ్మిగనూరు మండల పరిధిలోని కందనాతి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. గ్రామంలోని పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 95 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నారని తెలిపారు. అయితే, పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని దీంతో విద్యార్థులు సరిగా చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.