ఎమ్మిగనూరు మండలం చల్లకూలూరు శివాలయంలో తితిదే ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ఘనంగా ముగిశాయి. శుక్రవారం కార్యక్రమాల్లో డాక్టర్ మల్లు వేంకటరెడ్డి ధర్మం, వ్యక్తి వికాసం, సమాజాభ్యుదయంపై ముఖ్య సందేశం ఇచ్చారు. గోపూజ, కుంకుమార్చనతో ముగిసిన ఈ కార్యక్రమంలో భజనలు, ధార్మిక ప్రసంగాలు భారీ సంఖ్యలో భక్తులను ఆకర్షించాయి.