గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక సాధికారత కోసం కేంద్రం ‘లఖ్పతి దీదీ’ పథకాన్ని తీసుకొచ్చింది. మహిళలకు వివిధ చిరు వ్యాపారాలపై శిక్షణ, ప్రోత్సాహం అందజేస్తుంది. స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండి, 18-50 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో వడ్డీ లేకుండా రూ.5 లక్షల లోన్ పొందొచ్చు. సంబంధిత పత్రాలతో జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయంలో దీనికి దరఖాస్తు చేసుకోవాలి.