AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని బొత్స సత్యన్నారాయణ మండిపడ్డారు. 3 రోజులుగా సాక్షి కార్యాలయాలపై పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని, ఇవాళ ఏలూరు సాక్షి కార్యాలయానికి నిప్పుపెట్టడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడేనని ధ్వజమెత్తారు. భవిష్యత్లో తీవ్ర పరిణామాలను దారితీస్తాయని హెచ్చరించారు. ఈ అరాచకాలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు.