AP: విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన న్యాయవాదుల బస్సు రాజస్థాన్లోని అజ్మేర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి మృతి చెందారు. 11 మంది న్యాయవాదులు గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.