ప్రభుత్వం జారీ చేసే జీవోలన్ని ఒక పోర్టల్‌లో పెడతాం: మంత్రి పార్థసారథి

84చూసినవారు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవోను గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్ అనే వెబ్ పోర్టల్‌లో పొందుపరుస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచేసిన జీవోలను కూడా https://apegazette.cgg.gov.in/లో పొందుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేసే పాలసీలు, పనులు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్