AP: పల్నాడు జిల్లా కేసానుపల్లి శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో దాదాపు 19మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలు కాగా వారిని నరసరావు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.