యూపీలో జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న మహా కుంభమేళా కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి వెళ్లే యాత్రికుల కోసం ఆరు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. యాత్రలో భాగంగా దానాపూర్ ఎక్స్ప్రెస్ (12791) మొదటి రోజు ఉదయం 9:25 గంటలకు ప్రయాగరాజ్ బయలుదేరి ఆరో రోజు తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. మరిన్ని వివరాలకు ఐఆర్సీటీసీ యాప్ను సంప్రదించవచ్చు.