AP: ఎస్వీ గోశాలపై కూటమి నేతలు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన పరస్పర సవాళ్లతో తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. గోశాలలో ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేతలు ఆరోపించడం దెయ్యాలు వేదాలు చెప్పినట్లు ఉందని కూటమి నేతలు విమర్శించారు. తాము గోశాల వద్దకు వచ్చామని, భూమనతో సహా ఇతర వైసీపీ నేతలు ఇక్కడికి రాలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. కాగా, భూమనకు టీడీపీ నేతలు వరుస ఫోన్ కాల్స్ చేసిన విషయం తెలిసిందే.