మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం సంభవించింది. రాయ్గఢ్ జిల్లాలోని ఎస్పీఆర్ కెమికల్ కంపెనీలో ఆదివారం భారీగా మంటలు చెలరేగాయి. దీంతో కంపెనీలో ఉన్న కార్మికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.