ఏపీలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 డిగ్రీలకు పైగా సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలు జిల్లా సి.బెలగల్లో 35.9 డిగ్రీల సెల్సియస్, సత్యసాయి జిల్లా కొత్త చెరువులో 35.9 డిగ్రీల సెల్సియస్, నంద్యాల, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, ప్రకాశం జిల్లా కనిగిరిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.