AP: హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మరోసారి మానవత్వం చాటుకున్నారు. విశాఖపట్నం తాడిచెట్లపాలెం జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి నిస్సహాయ స్థితిలో పడి ఉండటం చూసి చలించిపోయారు. అటుగా ఎయిర్ పోర్ట్కు వెళ్తున్న హోంమంత్రి ఘటనను చూసి కాన్వాయ్ని ఆపి సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన ఓ వృద్ధురాలు సహా పలువురికి ఏం ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.