AP: మంగళగిరి పట్టణం టిడ్కో కాలనీలో దివీస్ లేబరేటరీస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆదివారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా టిడ్కో కాలనీకి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక ప్రజానీకం, కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతి ఇచ్చి మంత్రి లోకేష్ కు స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్ ను మంత్రి లోకేష్ ప్రారంభించారు.