ఏపీ రాజధాని అమరావతిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ మంగళవారం పర్యటిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన గ్రావెల్, మట్టి పరిశీలించేందుకు మంత్రి నారాయణ వెళ్లారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అనంతవరంలోని గ్రావెల్ను మంత్రి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం రాజధాని పనులను శరవేగంగా పట్టాలెక్కించడంతో...విద్య, వైద్యం, వాణిజ్యం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశ, విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి.