AP: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు ఎన్ఎండీ ఫరూఖ్, ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూఖ్ మాట్లాడుతూ.. నామినేటెడ్ పోస్టుల విషయంలో తుది నిర్ణయం అధిష్ఠానానిదేనన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి పార్టీ శ్రేణుల నుంచి పేర్లు తీసుకున్నట్టు వెల్లడించారు.